/rtv/media/media_files/2025/08/02/india-imports-oil-firms-russia-2025-08-02-13-17-23.jpg)
భారత్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపివేసినట్లు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. తమ సంస్థలు రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త టారిఫ్లు, అదనపు పెనాల్టీల భయంతో కొన్ని భారతీయ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు స్పాట్ మార్కెట్లో రష్యా చమురును కొనుగోలు చేయడం ఆపేశాయి. ట్రంప్ కూడా ఆ వార్తలపై స్పందిస్తూ ఇండియా మంచి నిర్ణయం తీసుకుందని అన్నారు.
🇺🇸🇮🇳🇨🇳 The sanctions would slap 100% tariffs on buyers of Russian oil, with the biggest customers being India and China, - Reuters
— Dzis Maksym (@DzisMaksym) August 1, 2025
This move has the potential to disrupt global oil supplies, given that Russia exported 4.68 million barrels per day of crude oil in June, around… pic.twitter.com/HE9Tm0GDYu
భారత్, రష్యా మధ్య వాణిజ్య సంబంధాలు, ముఖ్యంగా చమురు, రక్షణ ఒప్పందాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, భారత్ నుండి ఎగుమతులపై 25% సుంకాన్ని విధించడంతో పాటు, రష్యా నుండి చమురు, ఆయుధాల కొనుగోళ్లపై అదనపు పెనాల్టీలు విధించారు. ఈ పరిణామాల కారణంగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (MRPL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు స్పాట్ మార్కెట్లో రష్యా చమురు కొనుగోలును నిలిపివేశాయని వార్తాలు ప్రచారం అయ్యాయి.
అయితే, కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఈ వార్తలను ఖండించాయి. భారత చమురు సంస్థలు తమ నిర్ణయాలను ధరలు, రవాణా, ఇతర ఆర్థిక అంశాల ఆధారంగా, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకుంటాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను ఆపాలని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేశారు. భారతదేశం 85% ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందని, అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా రష్యా నుంచి చౌకగా లభించే చమురును భారత్ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. దీంతో రష్యా, భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించింది. అయితే, అమెరికా ఒత్తిడి మరియు కొత్త టారిఫ్ల నేపథ్యంలో, భారత్ తన చమురు దిగుమతులను వైవిధ్యపరిచే ప్రయత్నాల్లో భాగంగా ఇతర దేశాలైన అమెరికా, సౌదీ అరేబియా మరియు మధ్యప్రాచ్యం నుంచి చమురు దిగుమతులను పెంచుకుంటోందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ చమురు మార్కెట్పై మరియు భారత్ విదేశాంగ విధానంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.